నేషనల్ కెరీర్ గైడెన్స్ ప్లాట్ఫారమ్ ప్రారంభం
- July 06, 2023
మస్కట్: నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ (NEP) "ఖుతా" ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. ఇది ఒమన్ సుల్తానేట్లో కెరీర్ గైడెన్స్ కోసం మొదటి జాతీయ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్. ఇది విద్య, శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ, కార్మిక మార్కెట్ మరియు ఉపాధి రంగాలలో ఒమన్ విజన్ 2040 యొక్క వ్యూహాలకు అనుగుణంగా పనిచేయనుంది. ఈ వేడుకను ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ హెడ్ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఖమీస్ బిన్ సైఫ్ అల్ జబ్రీ స్పాన్సర్ చేశారు. "ఖుతా" ప్లాట్ఫారమ్ పాఠశాల, ఉన్నత విద్యలోని విద్యార్థులు, ఉద్యోగార్ధులు, ఉద్యోగులు, స్వయం-యజమానులు, వ్యవస్థాపకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలను లక్ష్యంగా పనిచేస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ ఖమీస్ అంబుసైది వివరించారు. కేవలం ఉద్యోగావకాశాలకే పరిమితం కాకుండా ఉద్యోగార్థులు, పాఠశాల విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టేందుకు శిక్షణ కోర్సులను అందజేస్తుందన్నారు. విద్యార్థులను వృత్తులు, శిక్షణా కోర్సుల వైపు మళ్లించడంలో కెరీర్ గైడెన్స్ స్పెషలిస్ట్ పాత్ర ద్వారా ఈ వేదిక విద్యా మంత్రిత్వ శాఖ పనిని పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









