మదీనాను సందర్శించిన 142,588 మంది యాత్రికులు

- July 07, 2023 , by Maagulf
మదీనాను సందర్శించిన 142,588 మంది యాత్రికులు

మదీనా:  హజ్ యాత్ర అనంతరం మదీనా చేరుకున్న వివిధ దేశాల యాత్రికుల సంఖ్య 142,588కి చేరుకుంది. వారు వాయుమార్గం,  రోడ్డు మార్గంలో అలాగే హరమైన్ హై-స్పీడ్ రైల్వే ద్వారా వచ్చారు. బుధవారం మదీనాకు వచ్చిన మొత్తం హజ్ యాత్రికుల సంఖ్య 17,258 కాగా, వీరిలో 15,159 మంది 395 విమానాల్లో హిజ్రా స్టేషన్‌కు చేరుకున్నారని హజ్ మరియు ఉమ్రా కమిటీ తెలిపింది. హరమైన్ హై-స్పీడ్ రైల్వే స్టేషన్‌కు 395 ట్రిప్పుల్లో 1,797 మంది యాత్రికులు వచ్చారుతమ దేశాలకు బయలుదేరిన హజ్ యాత్రికుల సంఖ్య 36,963కి చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం నాటికి మదీనాలో వివిధ దేశాలకు చెందిన 105,617 మంది యాత్రికులు ఉన్నారు. మదీనాలో గృహ ఆక్యుపెన్సీ శాతం 35% కాగా, వైద్య సేవల ద్వారా ప్రయోజనం పొందిన యాత్రికుల సంఖ్య 56,894కి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com