1.1 మిలియన్ దిర్హాంల విలువైన ఆభరణాలు చోరీ.. 12 గంటల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్
- July 08, 2023
యూఏఈ: 1.1 మిలియన్ దిర్హామ్ల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ల నగదును అపహరించిన ముగ్గురు నిందితులను కేవలం 12 గంటల వ్యవధిలో అజ్మాన్ పోలీసులు పట్టుకున్నారు. అజ్మాన్ పోలీస్లోని ఆపరేషన్ గదికి బంగారు దుకాణం నుండి దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే ఒక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేసారు. ముగ్గురు నిందితులు పలుమార్లు బట్టలు మార్చుకుని, ముసుగులు ధరించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఏజీ, టీడీ, ఎస్ఏగా గుర్తించిన ముగ్గురు అరబ్ నిందితులను గుర్తించిన అధికారులు పట్టుకోగలిగారు. షార్జా పోలీసుల సహాయంతో మొదటి వ్యక్తిని పట్టుకున్నారు. రెండో నిందితుడు అజ్మాన్లోని రుమైలాలో టీడీ, అజ్మాన్లోని పారిశ్రామిక ప్రాంతంలో దోపిడీకి ప్లాన్ చేసి నడిపించిన మూడో నిందితుడు ఎస్ఏని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు తమ నేరాలను అంగీకరించారు. వారి నుండి 1.1 మిలియన్ దిర్హాంల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ నగదును రికవరీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచి, అటువంటి నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని అజ్మాన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







