ఎమిరేటైజేషన్: జూలై 8 నుండి Dh42,000 జరిమానా విధింపు
- July 08, 2023
యూఏఈ: అర్ధ-వార్షిక ఎమిరటైజేషన్ గడువును చేరుకోని సంస్థలకు జూలై 8 నుండి జరిమానాలు విధించనున్నట్టు యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు నైపుణ్యం కలిగిన పాత్రల్లో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్యలో 1 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడానికి జూలై 7 తుది గడువు అని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. కంప్లైంట్ చేయని ఎంటిటీలు 2022 నుండి మిగిలిన ఆర్థిక సహకారాలతో పాటు ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి Dh42,000 ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్/జరిమానా విధిస్తారని MoHRE ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం తమ వర్క్ఫోర్స్లో 2 శాతం ఎమిరాటీలను చేర్చుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 1 శాతం, మరో అర్ధ బాగంలో మరో 1 శాతం సాధించాలి. ఈ సంవత్సరం అరాఫత్ డే, ఈద్ అల్ అదా సెలవులను పరిగణనలోకి తీసుకుని జూన్ 30 నుండి జూలై 7 వరకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి మంత్రిత్వ శాఖ గడువును పొడిగించింది. 2022 నాటి తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలనుంచి మంత్రిత్వ శాఖ 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను వసూలు చేసింది. మేలో విడుదల చేసిన డేటా ప్రకారం, తప్పనిసరి ఎమిరేటైజేషన్ డ్రైవ్ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే యూఏఈ పౌరుల సంఖ్యను పెంచడంలో సహాయపడింది. 66,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







