యాత్ర 2 మోషన్ పోస్టర్ విడుదల...
- July 08, 2023
హైదరాబాద్: ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. మహీ వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కథ ఆధారంగా సీక్వెల్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ఒక నిమిషం పాటు ఉన్న ఈ మోషన్ పోస్టర్ వీడియోలో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తుంటుంది. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను” అంటూ జగన్ వాయిస్ ఓవర్ వచ్చింది. ఇక ఈ సినిమాకి ప్రాజెక్ట్ K కి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. మోషన్ పోస్టర్ గ్లింప్స్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాగా ఈ చిత్రాన్ని V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
2024 ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో జగన్ పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనే దాని పై ఇంకా సస్పెన్స్ నెలకుంది. తమిళ్ హీరో జీవా పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి అవుతుందని’ ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







