సోషల్ మీడియాలో 'ఆక్షేపణీయమైన' వీడియో షేర్.. నివాసి అరెస్ట్
- July 10, 2023
యూఏఈ: ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే వీడియోను పోస్ట్ చేయడంలో ఇంటర్నెట్ను దుర్వినియోగం చేసిందని ఆరోపించబడిన ఒక ఆసియా నివాసిని అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఆమోదించబడిన మీడియా ప్రమాణాలకు విరుద్ధంగా, ఎమిరాటీ సమాజాన్ని అవమానించే కంటెంట్ను ప్రచురించినందుకు ఆసియా ప్రవాసుడిపై కేసు నమోదు చేశారు. యూఏఈ అటార్నీ జనరల్ ఆఫీస్లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలోని వీడియో క్లిప్ను పరిశీలించిన ఈ చర్యలు తీసుకున్నారు.
వీటియోలో ఏముందంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నివాసి ఎమిరాటీ దుస్తులు ధరించి విలాసవంతమైన కార్ షోరూమ్లోకి వెళ్లాడు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించారు. షోరూమ్ యజమానితో అతను 2 మిలియన్ దిర్హామ్ల కంటే ఖరీదైన కారును కొనమని గర్వంగా అడుగుతాడు. అతను షోరూమ్ ఉద్యోగులకు డబ్బుకు విలువ ఇవ్వని విధంగా, ఎమిరాటీ పౌరుల అవమానకరమైన ఇమేజ్ను ప్రచారం చేస్తూ, వారిని ఎగతాళి చేసే విధంగా పెద్ద మొత్తంలో నగదును కూడా ఇస్తున్నట్లు చూపించారు. ఇది ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించి, రెచ్చగొడుతుందిని అధికారులు తెలిపారు. యూఏఈలోని సోషల్ మీడియా వినియోగదారులను వారు ప్రచురించే మీడియా కంటెంట్లో చట్టపరమైన, నైతిక నిబంధనలను పాటించాలని, సమాజం సామాజిక లక్షణాలు, పొందుపరిచిన విలువలను పరిగణనలోకి తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







