సోషల్ మీడియాలో 'ఆక్షేపణీయమైన' వీడియో షేర్.. నివాసి అరెస్ట్
- July 10, 2023
యూఏఈ: ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే వీడియోను పోస్ట్ చేయడంలో ఇంటర్నెట్ను దుర్వినియోగం చేసిందని ఆరోపించబడిన ఒక ఆసియా నివాసిని అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఆమోదించబడిన మీడియా ప్రమాణాలకు విరుద్ధంగా, ఎమిరాటీ సమాజాన్ని అవమానించే కంటెంట్ను ప్రచురించినందుకు ఆసియా ప్రవాసుడిపై కేసు నమోదు చేశారు. యూఏఈ అటార్నీ జనరల్ ఆఫీస్లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలోని వీడియో క్లిప్ను పరిశీలించిన ఈ చర్యలు తీసుకున్నారు.
వీటియోలో ఏముందంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నివాసి ఎమిరాటీ దుస్తులు ధరించి విలాసవంతమైన కార్ షోరూమ్లోకి వెళ్లాడు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించారు. షోరూమ్ యజమానితో అతను 2 మిలియన్ దిర్హామ్ల కంటే ఖరీదైన కారును కొనమని గర్వంగా అడుగుతాడు. అతను షోరూమ్ ఉద్యోగులకు డబ్బుకు విలువ ఇవ్వని విధంగా, ఎమిరాటీ పౌరుల అవమానకరమైన ఇమేజ్ను ప్రచారం చేస్తూ, వారిని ఎగతాళి చేసే విధంగా పెద్ద మొత్తంలో నగదును కూడా ఇస్తున్నట్లు చూపించారు. ఇది ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించి, రెచ్చగొడుతుందిని అధికారులు తెలిపారు. యూఏఈలోని సోషల్ మీడియా వినియోగదారులను వారు ప్రచురించే మీడియా కంటెంట్లో చట్టపరమైన, నైతిక నిబంధనలను పాటించాలని, సమాజం సామాజిక లక్షణాలు, పొందుపరిచిన విలువలను పరిగణనలోకి తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది.
తాజా వార్తలు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!









