చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంది
- May 14, 2016
చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది. భారత సరిహద్దులకు దగ్గరలో చైనా తన సైనిక బలగాలను పెంచినట్లు తాము గమనించామని అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (తూర్పు ఆసియా) అబ్రహాం ఎం డెన్మార్క్ వెల్లడించారు. చైనా సైనిక, భద్రతా బలగాలకు సంబంధించిన పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన వార్షిక నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించిన అనంతరం డెన్మార్క్ ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే చైనా ఏ ఉద్దేశంతో తన రక్షణ పాటవాన్ని, సైనిక బలగాల మోహరింపును పెంచుకుంటోందో అనే విషయంలో ఒక నిర్ధారణకు రావడం కష్టమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









