ఆహార భద్రత ఉల్లంఘన. రెస్టారెంట్ను మూసివేసిన యూఏఈ అథారిటీ
- July 12, 2023
యూఏఈ: 'ప్రజారోగ్యానికి ప్రమాదం' కలిగించే అనేక ఉల్లంఘనల కారణంగా అబుధాబిలోని ఒక రెస్టారెంట్ను ఎమిరేట్లోని ఫుడ్ సేఫ్టీ అథారిటీ మూసివేయవలసిందిగా ఆదేశించింది. అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) ప్రకారం.. ఎవర్గ్రీన్ వెజిటేరియన్ రెస్టారెంట్ - బ్రాంచ్ 3లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సింక్ చుట్టూ ఉన్న కీటకాలు, పాత్రల నిల్వ, తయారీ ప్రాంతాలు, అలాగే అసమర్థమైన శీతలీకరణతో సహా పలు ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించకుండానే ఆహారాన్ని నిల్వ చేయడాన్ని గుర్తించారు. ఈ ప్రమాదకర పరిస్థితులను సరిచేయాలని, ఆహార భద్రతను మెరుగుపరచాలని రెస్టారెంట్ను పదేపదే హెచ్చరించినప్పటికీ, దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. రెస్టారెంట్ ను మూసివేయాలని ఆర్డర్ను జారీ చేసింది. ఇది రెస్టారెంట్ ఎమిరేట్ చట్టం ద్వారా నిర్దేశించబడిన అన్ని అవసరమైన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను నెరవేర్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. మే 2023లో ఆహార భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు అల్ ఐన్లో హోలోమీట్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ మూసివేసిన విషయం తెలిసిందే. అబుధాబి ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







