ఆహార భద్రత ఉల్లంఘన. రెస్టారెంట్ను మూసివేసిన యూఏఈ అథారిటీ
- July 12, 2023
యూఏఈ: 'ప్రజారోగ్యానికి ప్రమాదం' కలిగించే అనేక ఉల్లంఘనల కారణంగా అబుధాబిలోని ఒక రెస్టారెంట్ను ఎమిరేట్లోని ఫుడ్ సేఫ్టీ అథారిటీ మూసివేయవలసిందిగా ఆదేశించింది. అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) ప్రకారం.. ఎవర్గ్రీన్ వెజిటేరియన్ రెస్టారెంట్ - బ్రాంచ్ 3లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సింక్ చుట్టూ ఉన్న కీటకాలు, పాత్రల నిల్వ, తయారీ ప్రాంతాలు, అలాగే అసమర్థమైన శీతలీకరణతో సహా పలు ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించకుండానే ఆహారాన్ని నిల్వ చేయడాన్ని గుర్తించారు. ఈ ప్రమాదకర పరిస్థితులను సరిచేయాలని, ఆహార భద్రతను మెరుగుపరచాలని రెస్టారెంట్ను పదేపదే హెచ్చరించినప్పటికీ, దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. రెస్టారెంట్ ను మూసివేయాలని ఆర్డర్ను జారీ చేసింది. ఇది రెస్టారెంట్ ఎమిరేట్ చట్టం ద్వారా నిర్దేశించబడిన అన్ని అవసరమైన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను నెరవేర్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. మే 2023లో ఆహార భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు అల్ ఐన్లో హోలోమీట్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ మూసివేసిన విషయం తెలిసిందే. అబుధాబి ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి







