ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు
- July 12, 2023
యూఏఈ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలకు విమాన సర్వీసులను యధాతథంగా నడుపుతున్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 31 మంది మరణించారని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







