ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు
- July 12, 2023
యూఏఈ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలకు విమాన సర్వీసులను యధాతథంగా నడుపుతున్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 31 మంది మరణించారని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









