ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు
- July 12, 2023
యూఏఈ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలకు విమాన సర్వీసులను యధాతథంగా నడుపుతున్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 31 మంది మరణించారని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







