హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన.. నలుగురు ఉగ్రవాదులకు పదేండ్ల జైలు శిక్ష
- July 13, 2023
న్యూఢిల్లీ: హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒబేద్, రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆప్తాబ్ ఆలం అనే నలుగురు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ చేసిన వాదనలతో ప్రత్యే కోర్టు ఏకీభవించింది. 2007లో హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో జరిగిన పేలుళ్లు.. 2013లో దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించింది. ఇవేకాకుండా వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ వీరి పాత్ర ఉందని గుర్తించింది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







