హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన.. నలుగురు ఉగ్రవాదులకు పదేండ్ల జైలు శిక్ష
- July 13, 2023
న్యూఢిల్లీ: హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒబేద్, రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆప్తాబ్ ఆలం అనే నలుగురు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ చేసిన వాదనలతో ప్రత్యే కోర్టు ఏకీభవించింది. 2007లో హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్కులో జరిగిన పేలుళ్లు.. 2013లో దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించింది. ఇవేకాకుండా వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ వీరి పాత్ర ఉందని గుర్తించింది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









