'24' మూవీ పైరసీ బారిన పడిందని...
- May 15, 2016
హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన '24' మూవీ పైరసీ బారిన పడిందని సూర్య కజిన్, నిర్మాత కూడా అయిన జ్ఞానవేల్ రాజా దీక్షకు దిగాడు. బెంగుళూరులోని ఓ థియేటర్లో ఈ సినిమా తమిళ వెర్షన్ను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారని, అయినా దీనిని అడ్డుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.'శుక్రవారం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా ఇండస్ట్రీ పట్టించుకోలేదని' జ్ఞానవేల్ రాజా వాపోయాడు. అయితే పైరసీ బెడదను నివారించేందుకు ఇండస్ట్రీ పెద్దలు గట్టి చర్యలు తీసుకునేంతవరకూ తాను పోరాడతానని ఆయన అంటున్నాడు. తెలుగులో ఈ చిత్రం బాగానే ఆడుతున్నా తమిళ బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రాజా కలవరపడుతున్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









