2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!
- July 15, 2023
యూఏఈ: షార్జా టాక్సీ 2023 మొదటి అర్ధభాగంలో 2.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది. సగటున రోజుకు 15,000 మంది ప్రయాణికులు టాక్సీలలో ప్రయాణించారు. ముఖ్యంగా ఈద్ అల్-అధా సెలవుల సమయంలో 102,000 మంది ప్రయాణీకులు టాక్సీలను ఆశ్రయించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% అధికం కావడం గమనార్హం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా ఈద్ సందర్భంగా రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం 23,476 మంది ప్రయాణికులు షార్జా టాక్సీని విమానాశ్రయానికి వెళ్లడానికి , తిరిగి రావడానికి ఉపయోగించారని ఓసూల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ యాక్టింగ్ జనరల్ మేనేజర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ట్యాక్సీ తన వాహనాల్లో 100% పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









