షేక్ మహమ్మద్ 74వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా వేడుకలు
- July 15, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేడు 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన సాధించిన విజయాలు, దార్శనికతను గుర్తుచేసుకొని కొనియాడుతున్నారు. ఆయన దార్శనికత, వారసత్వం రాబోయే తరాలకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.
షేక్ మొహమ్మద్ "నంబర్ వన్" దూరదృష్టి గల నాయకత్వ నమూనాను స్థాపించారు. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య నుండి సాంకేతికత, పర్యాటకం వరకు ప్రఖ్యాతి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పని చేయడానికి, నివసించడానికి వీలుగా దుబాయ్ ని తీర్చిదిద్దాడు.
ఆయన పాలనలో మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, భూమిపై అత్యంత అందమైన భవనంగా గుర్తింపు సాధించింది. అదే విధంగా బుర్జ్ అల్ అరబ్, ప్రపంచంలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్, బుర్జ్ ఖలీఫా- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం, మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్- యూఏఈ మొదటి అంతరిక్ష సంస్థ, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్- ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో ఒకటి, DP వరల్డ్- ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి,ఎక్స్పో 2020- 'భూమిపై గొప్ప ప్రదర్శన'గా గుర్తింపు పొందాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









