యూఏఈ-ఇండియా మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్యం: ప్రధాని మోదీ

- July 15, 2023 , by Maagulf
యూఏఈ-ఇండియా మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్యం: ప్రధాని మోదీ

యూఏఈ: యూఏఈ-ఇండియా మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్యం చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయని యూఏఈలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అబుధాబిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు)లపై అధికారులు సంతాలు చేశారు.

ఈ ఎంఓయూలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్,  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ గవర్నర్ ఖలీద్ మహమ్మద్ బాలమా సంతకాలు చేశారు. క్రాస్ బోర్డర్ లావాదేవీలు,  చెల్లింపులను సులభతరం చేయడం.. భారత్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య గొప్ప ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందాల లక్ష్యం. "భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE (CBUAE) స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.భారతీయ రూపాయి (INR), UAE దిర్హామ్ (AED) మధ్య లావాదేవీలు, చెల్లింపు వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి ఇది దోహదం చేస్తుంది. " అని అధికారిక ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది. "ఇండియా, యూఏఈ మధ్య లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల ఉపయోగం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై అవగాహన ఒప్పందం కుదిరింది. INR,  AED ద్వైపాక్షిక వినియోగాన్ని ప్రోత్సహించడానికి స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ (LCSS)ని ఏర్పాటు చేయాలని ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది" అని ఆర్బీఐ పేర్కొంది. అనంతరం "భారత్-యూఏఈ సహకారంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది మెరుగైన ఆర్థిక సహకారానికి మార్గం సుగమం చేస్తుంది.అంతర్జాతీయ ఆర్థిక పరస్పర చర్యలను సులభతరం చేస్తుంది" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అన్ని కరెంట్ ఖాతా లావాదేవీలు, అనుమతించబడిన మూలధన ఖాతా లావాదేవీలను కూడా ఈ ఎంఓయూ కవర్ చేస్తుంది. LCSS ద్వారా ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సంబంధిత దేశీయ కరెన్సీలలో ఇన్‌వాయిస్, చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఇది INR-AED విదేశీ మారకపు మార్కెట్ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.  UPI-IPP లింకేజ్ ఏ దేశంలోనైనా వినియోగదారులను వేగంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు ఖర్చుతో కూడుకున్న క్రాస్-బోర్డర్ నిధుల బదిలీలను చేయడానికి వీలు కల్పిస్తుంది. కార్డ్ స్విచ్‌ల అనుసంధానం దేశీయ కార్డ్‌ల పరస్పర అంగీకారాన్ని, కార్డ్ లావాదేవీల ప్రాసెసింగ్‌ను సులభతరం చేస్తుంది. సందేశ వ్యవస్థల అనుసంధానం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సందేశాలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడిందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com