జెడ్డాలో చర్చలు జరిపిన క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- July 17, 2023
జెడ్డా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదివారం విసృత చర్చలు జరిపారు. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో ప్రిన్స్ మహ్మద్ కిషిదాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అధికారిక రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సౌదీ-జపనీస్ విజన్ 2030కి అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు చర్చలు జరిపారు. వారు అనేక ప్రాంతీయ - అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జపాన్ కంపెనీల అధిపతులు, వ్యాపార యజమానుల బృందంతో క్రౌన్ ప్రిన్స్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







