కువైట్ లో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగుల తొలగింపు
- July 17, 2023
కువైట్: 2023 సంవత్సరం ప్రథమార్థంలో బహిష్కరణకు గురైన.. ఉద్యోగాల నుండి తొలగించబడిన ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగులను తొలగించారు. అదే సమయంలో బహిష్కరణ గణాంకాలు కూడా పెరుగుతున్నాయి. కాగా, ఈ నెలలో బహిష్కరణకు గురైన 1,000 కంటే ఎక్కువ మంది ప్రవాసులు బహిష్కరణ కేంద్రంలో ఉన్నారు. క్రిమినల్ లేదా దుష్ప్రవర్తన కేసులు, అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణ లేదా కువైట్ నుండి వారిని బహిష్కరించాలని న్యాయపరమైన తీర్పుల కారణంగా పలువురిని బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఈజిప్షియన్లు, బంగ్లాదేశీయులు ఉన్నారని నివేదిక పేర్కొంది. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన 7,000 మందితో సహా గత సంవత్సరం దాదాపు 250,000 మంది శాశ్వతంగా కువైట్ను విడిచిపెట్టినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







