క్రౌన్ ప్రిన్స్ తో చర్చలు జరిపిన టర్కీ అధ్యక్షుడు
- July 18, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం జెడ్డాలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో చర్చలు జరిపారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు మూడు రోజుల గల్ఫ్ పర్యటనలో భాగంగా ఎర్డోగాన్ సౌదీ అరేబియా చేరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ టర్కీ అధ్యక్షుడికి అల్-సల్లం ప్యాలెస్లో అధికారికంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు అధికారిక చర్చలు, ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. మూడు గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా ఎర్డోగాన్ సౌదీకి వచ్చారు. “గత 20 ఏళ్లలో సౌదీ అరేబియాలో మా కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రాజెక్టుల విలువ సుమారుగా 25 బిలియన్ డాలర్లు. సౌదీ అరేబియా భారీ-స్థాయి ప్రాజెక్టులలో టర్కీ కంపెనీలు ఎక్కువ పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాము, ” అని పర్యటనకు బయలుదేరే ముందు ఇస్తాంబుల్ లో మీడియాతో చెప్పారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









