క్రౌన్ ప్రిన్స్ తో చర్చలు జరిపిన టర్కీ అధ్యక్షుడు
- July 18, 2023
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం జెడ్డాలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో చర్చలు జరిపారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు మూడు రోజుల గల్ఫ్ పర్యటనలో భాగంగా ఎర్డోగాన్ సౌదీ అరేబియా చేరుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ టర్కీ అధ్యక్షుడికి అల్-సల్లం ప్యాలెస్లో అధికారికంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు అధికారిక చర్చలు, ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. మూడు గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా ఎర్డోగాన్ సౌదీకి వచ్చారు. “గత 20 ఏళ్లలో సౌదీ అరేబియాలో మా కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రాజెక్టుల విలువ సుమారుగా 25 బిలియన్ డాలర్లు. సౌదీ అరేబియా భారీ-స్థాయి ప్రాజెక్టులలో టర్కీ కంపెనీలు ఎక్కువ పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాము, ” అని పర్యటనకు బయలుదేరే ముందు ఇస్తాంబుల్ లో మీడియాతో చెప్పారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







