జపాన్కు వెళ్లడానికి వీసా నిబంధనలను సడలింపు: జపాన్ ప్రధాని కిషిడా
- July 18, 2023
యూఏఈ: జపాన్కు వెళ్లడానికి వీసాలు పొందడం ఇకపై సరళీకృతం కానుంది. ఒసాకాకు ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రకటించిన కొత్త సేవ రెండు దేశాల మధ్య విమాన ట్రాఫిక్ను పెంచుతుందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అబుధాబిలో తెలిపారు. సాధారణ పాస్పోర్ట్లు కలిగిన యూఏఈ పౌరులు జపాన్కు వెళ్లే ముందు విజిట్ వీసా పొందనవసరం లేదని, ప్రవాసులు ఇ-వీసా కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇకపై మిషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, జాతీయ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్వేస్ అక్టోబర్ 1 నుండి వారానికి ఐదుసార్లు ఒసాకాకు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. కిషిదా తన మొదటి యూఏఈ పర్యటనలో యూఏఈ-జపాన్ బిజినెస్ ఫోరమ్ను ఉద్దేశించి మాట్లాడారు. జపాన్కు తరచూ సేవలు అందించడం వల్ల వాణిజ్యం, పర్యాటకం మరియు వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డాయి. జాతీయ విమానయాన సంస్థలు ఎతిహాద్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ రెండూ జపాన్కు వారానికి 20 కంటే ఎక్కువ విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







