బాలలను ఉరేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
- June 23, 2015
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.రమదాన్ మాసం జరుగుతున్న నేపథ్యంలో ఉపవాసం ఉండకుండా పగటిపూట తిన్నారనే పాపానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు బాలలను ఉరేసి చంపేశారు. ఈ దారుణ ఘటన హిస్పా రాజధానిలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉరితీసిన బాలలిద్దరూ 18 సంవత్సరాల లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు. రమదాన్ ఉపవాసం చేపట్టకుండా వీరిద్దరూ ఆహారం తింటూ దొరికిపోయారని, ఇద్దరు బాలల వయసూ 18 సంవత్సరాల్లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపారు. మత నిబంధనలు పాటించలేదంటూ.. వారి శరీరాలపై ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు బాలల దేహాలను అలానే ఉంచారని మానవ హక్కుల కార్యకర్త వెల్లడించారు. కాగా రమదాన్ మాసం గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రమదాన్ మాసంలో మహమ్మదీయులు పగలంతా కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ క్రమంలో ఆహారం తీసుకోకుండా.. నీటిని కూడా సేవించరు.ఇంకా స్మోకింగ్ వంటి ఇతరత్రా చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







