బాలలను ఉరేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
- June 23, 2015
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.రమదాన్ మాసం జరుగుతున్న నేపథ్యంలో ఉపవాసం ఉండకుండా పగటిపూట తిన్నారనే పాపానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు బాలలను ఉరేసి చంపేశారు. ఈ దారుణ ఘటన హిస్పా రాజధానిలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉరితీసిన బాలలిద్దరూ 18 సంవత్సరాల లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు. రమదాన్ ఉపవాసం చేపట్టకుండా వీరిద్దరూ ఆహారం తింటూ దొరికిపోయారని, ఇద్దరు బాలల వయసూ 18 సంవత్సరాల్లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపారు. మత నిబంధనలు పాటించలేదంటూ.. వారి శరీరాలపై ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు బాలల దేహాలను అలానే ఉంచారని మానవ హక్కుల కార్యకర్త వెల్లడించారు. కాగా రమదాన్ మాసం గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రమదాన్ మాసంలో మహమ్మదీయులు పగలంతా కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ క్రమంలో ఆహారం తీసుకోకుండా.. నీటిని కూడా సేవించరు.ఇంకా స్మోకింగ్ వంటి ఇతరత్రా చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!







