మైనార్టీలకు తీపి కబురు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- July 20, 2023
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ మైనార్టీలకు తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేయబోతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మైనార్టీ ఛైర్మన్ల అభినందన సభలో పాల్గొన్న హరీశ్రావు ఈ శుభవార్త ను తెలిపారు.
బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.
పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ సన్మానించారు. జలవిహార్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







