ముగిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన
- July 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగి రావడానికి ముందు బీజేపీ అధ్యక్షుడు నడ్డాను పవన్ కలిశారు. గంటపాటు నడ్డాతో చర్చలు జరిపారు. నడ్డా నివాసంలో విస్తృత చర్చలు జరిగాయంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి నడ్డా, పవన్ చర్చించారంటూ జనసేన ప్రెస్నోట్ విడుదల చేసింది. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులతో పాటు తాజా రాజకీయాలపైనా నడ్డా, పవన్ చర్చించారని వెల్లడించింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పవన్ కల్యాణ్కు.. గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లారు. కాసేపట్లో పవన్కల్యాణ్ సమక్షంలో.. జనసేనలో చేరనున్నారు ఆమంచి కృష్ణమోహర్ సోదరుడు స్వాములు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







