ముగిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన
- July 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగి రావడానికి ముందు బీజేపీ అధ్యక్షుడు నడ్డాను పవన్ కలిశారు. గంటపాటు నడ్డాతో చర్చలు జరిపారు. నడ్డా నివాసంలో విస్తృత చర్చలు జరిగాయంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి నడ్డా, పవన్ చర్చించారంటూ జనసేన ప్రెస్నోట్ విడుదల చేసింది. రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులతో పాటు తాజా రాజకీయాలపైనా నడ్డా, పవన్ చర్చించారని వెల్లడించింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పవన్ కల్యాణ్కు.. గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. అభిమానులతో పవన్ సెల్ఫీలు దిగారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లారు. కాసేపట్లో పవన్కల్యాణ్ సమక్షంలో.. జనసేనలో చేరనున్నారు ఆమంచి కృష్ణమోహర్ సోదరుడు స్వాములు.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







