‘బ్రో’ ప్రమోషన్స్లో మార్క్ బిజీ బిజీ.! పవన్ జాయిన్ అయ్యేదెప్పుడంటే.!
- July 21, 2023
సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘బ్రో’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేశారు. ప్రచార చిత్రాలతో ఓ వైపు అంచనాలు పెంచేస్తుండగా, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ డైరెక్ట్ ప్రమోషన్లలోకి దిగారు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఇంటర్వ్యూలతో పాటూ, టూర్లతోనూ సాయి ధరమ్ తేజ్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో తేజు సందడి చేస్తున్నాడు. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ప్రమోషన్లలో కనిపిస్తాడా.? అని సినీ జనం ఈగర్గా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యవహారాల్లో బిజీగా వున్నారు. ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ హాజరయ్యేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా వుంటే, రేపో ఎల్లుండో ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
సుమద్ర ఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారమందించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









