ఎయిర్‌ ఇండియా పనితీరును అశోక్‌ గజపతిరాజు సమీక్షించనున్నారు

- May 16, 2016 , by Maagulf
ఎయిర్‌ ఇండియా పనితీరును అశోక్‌ గజపతిరాజు సమీక్షించనున్నారు

ఎయిర్‌ ఇండియా పనితీరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు సమీక్షించనున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని అక్కడి సీనియర్‌ అధికారులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం... ఈ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ, ఆ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే, పలువురు సీనియర్‌ అధికారులూ హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో సంస్థ లక్ష్యాలపై చర్చిస్తారు. ఎయిర్‌ ఇండియా విషయమై ఇటీవల అశోక్‌ గజపతి రాజు పార్లమెంటులో మాట్లాడారు. సంస్థ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ సాధించనుందని తెలిపిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com