కువైట్ లో గుండెపోటుతో భారత వ్యాపారి ముస్తఫా మృతి

- July 28, 2023 , by Maagulf
కువైట్ లో గుండెపోటుతో భారత వ్యాపారి ముస్తఫా మృతి

కువైట్: భారతీయ జాతీయుడు ముస్తఫా ( 56) జూలై 26న గుండెపోటుతో కువైట్‌లో మరణించారు.  ముస్తఫా చిన్న తరహా వ్యాపారాలు చేస్తూ హవల్లీ ప్రాంతంలోని ప్రసిద్ధ అల్మాస్ రెస్టారెంట్‌కి యజమానిగా మారారు. అతను కువైట్‌లోని తమిళనాడు ముస్లిం కల్చరల్ అసోసియేషన్ (TMCA) అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను IFL అసోసియేషన్‌లో చురుకైన సభ్యుడు.  అనేక సామాజిక సేవలు చేస్తున్నాడు. TMCA నిర్వహించిన సామాజిక సామరస్య సదస్సు విజయవంతానికి ఆయనే ప్రధాన భూమిక పోషించారు. ముస్తఫా కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  ముస్తఫా సంస్కరణలో పలువురు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com