ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సర్వీస్ ‘మారాహెబ్’ ప్రారంభం
- July 28, 2023
ముస్కా: ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సహకారంతో ఆఫ్ ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సర్వీస్ (మరాహెబ్)ను ప్రారంభించినట్టు ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ కంపెనీ తెలిపింది. ట్రావెల్ మరియు టూరిజం రంగంలో వేగవంతమైన మార్పులకు అనుగుణంగా కొత్త సేవ అందుబాటులోకి వచ్చింది. ఇది మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం ద్వారా ప్రయాణికుల అవసరాలను కూడా తీరుస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రయాణీకులు ట్రిప్కు ముందు ఎక్కడి నుండైనా చెక్-ఇన్ విధానాలను గరిష్టంగా 24 గంటలు మరియు కనిష్టంగా 6 గంటలలో పూర్తి చేయవచ్చు. ఒమన్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ షేక్ అయ్మాన్ అహ్మద్ అల్ హోస్నీ మాట్లాడుతూ.. ఈ సర్వీస్ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని చెప్పారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ తన సేవలను మెరుగుపరచడానికి, ప్రయాణీకులకు ఉత్తమ పరిష్కారాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయని అల్ హోస్నీ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







