యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం
- July 29, 2023
యూఏఈ: యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. ఇది నేటి నుండే అమల్లోకి వస్తుందని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 2023లో మంత్రివర్గ తీర్మానం నం. 120 ప్రకారం.. స్థానిక మార్కెట్లో తగినంత బియ్యం సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో ఈ సస్పెన్షన్ నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. జూలై 20, 2023 తర్వాత ఫ్రీ జోన్లతో సహా భారతదేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న బియ్యం ఎగుమతులు, తిరిగి వాటి ఎగుమతిపై నిషేధం కూడా అమల్లో ఉంటుందని తెలిపింది. ఏకీకృత కస్టమ్స్ టారిఫ్ (1006) పరిధిలోకి వచ్చే అన్ని బియ్యం రకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. బియ్యాన్ని ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు - భారతదేశం నుండి లేదా మరెక్కడైనా - అనుమతిని పొందడానికి మంత్రిత్వ శాఖకు తప్పనిసరిగా అభ్యర్థనను సమర్పించాలని సూచించింది. బియ్యం ఎగుమతి చేయడానికి అనుమతిని జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది స్థానిక మార్కెట్లో ధరలను సమతుల్యం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







