యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం
- July 29, 2023
యూఏఈ: యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. ఇది నేటి నుండే అమల్లోకి వస్తుందని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 2023లో మంత్రివర్గ తీర్మానం నం. 120 ప్రకారం.. స్థానిక మార్కెట్లో తగినంత బియ్యం సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో ఈ సస్పెన్షన్ నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. జూలై 20, 2023 తర్వాత ఫ్రీ జోన్లతో సహా భారతదేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న బియ్యం ఎగుమతులు, తిరిగి వాటి ఎగుమతిపై నిషేధం కూడా అమల్లో ఉంటుందని తెలిపింది. ఏకీకృత కస్టమ్స్ టారిఫ్ (1006) పరిధిలోకి వచ్చే అన్ని బియ్యం రకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. బియ్యాన్ని ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు - భారతదేశం నుండి లేదా మరెక్కడైనా - అనుమతిని పొందడానికి మంత్రిత్వ శాఖకు తప్పనిసరిగా అభ్యర్థనను సమర్పించాలని సూచించింది. బియ్యం ఎగుమతి చేయడానికి అనుమతిని జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది స్థానిక మార్కెట్లో ధరలను సమతుల్యం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









