యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం
- July 29, 2023
యూఏఈ: యూఏఈ లో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. ఇది నేటి నుండే అమల్లోకి వస్తుందని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 2023లో మంత్రివర్గ తీర్మానం నం. 120 ప్రకారం.. స్థానిక మార్కెట్లో తగినంత బియ్యం సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో ఈ సస్పెన్షన్ నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. జూలై 20, 2023 తర్వాత ఫ్రీ జోన్లతో సహా భారతదేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న బియ్యం ఎగుమతులు, తిరిగి వాటి ఎగుమతిపై నిషేధం కూడా అమల్లో ఉంటుందని తెలిపింది. ఏకీకృత కస్టమ్స్ టారిఫ్ (1006) పరిధిలోకి వచ్చే అన్ని బియ్యం రకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. బియ్యాన్ని ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు - భారతదేశం నుండి లేదా మరెక్కడైనా - అనుమతిని పొందడానికి మంత్రిత్వ శాఖకు తప్పనిసరిగా అభ్యర్థనను సమర్పించాలని సూచించింది. బియ్యం ఎగుమతి చేయడానికి అనుమతిని జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అల్ మాయా గ్రూప్లో గ్రూప్ డైరెక్టర్, భాగస్వామి కమల్ వచాని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది స్థానిక మార్కెట్లో ధరలను సమతుల్యం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







