ప్రయాణికుల రెట్టింపే లక్ష్యంగా 'స్టాప్ఓవర్ ప్రోగ్రామ్'
- July 30, 2023
దోహా: డిస్కవర్ ఖతార్ (DQ) 2023/2024 కాలానికి తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఆవిష్కరించింది. “స్టాప్ఓవర్ ప్రోగ్రామ్” కోసం ప్రయాణికుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖతార్ను స్టాప్ఓవర్ కోరుకునే సందర్శకులకు ఖతార్ను అగ్ర ఎంపికగా ఉంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. డిస్కవర్ ఖతార్ అనేది ఖతార్ ఎయిర్వేస్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ, ఖతార్ టూరిజం జాయింట్ ప్రోగ్రామ్. 2022/2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇటీవలి ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ గణనీయమైన వృద్ధిని వెల్లడించారు. గత సంవత్సరం ఖతార్ టూరిజం, ఖతార్ ఎయిర్వేస్ కలిసి స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ను లాంఛ్ చేశాయి. ఇది దేశంలో పర్యాటకుల సంఖ్యను పెంచడానికి ఖతార్ టూరిజం అనుసరించిన ఆరు కీలక వ్యూహాలలో ఒకటిగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు ఫలితాన్నిచ్చాయి.
ఖతార్ టూరిజం తాజా డేటా ప్రకారం.. 2022/2023 సీజన్లో (డిసెంబర్ 2022 నుండి మార్చి 2023 వరకు) 253,191 క్రూయిజ్ సందర్శకులు వచ్చారు. ఇది మునుపటి సీజన్తో పోలిస్తే 151% పెరుగుదలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









