ప్రయాణికుల రెట్టింపే లక్ష్యంగా 'స్టాప్ఓవర్ ప్రోగ్రామ్'
- July 30, 2023
దోహా: డిస్కవర్ ఖతార్ (DQ) 2023/2024 కాలానికి తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఆవిష్కరించింది. “స్టాప్ఓవర్ ప్రోగ్రామ్” కోసం ప్రయాణికుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖతార్ను స్టాప్ఓవర్ కోరుకునే సందర్శకులకు ఖతార్ను అగ్ర ఎంపికగా ఉంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. డిస్కవర్ ఖతార్ అనేది ఖతార్ ఎయిర్వేస్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ, ఖతార్ టూరిజం జాయింట్ ప్రోగ్రామ్. 2022/2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇటీవలి ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ గణనీయమైన వృద్ధిని వెల్లడించారు. గత సంవత్సరం ఖతార్ టూరిజం, ఖతార్ ఎయిర్వేస్ కలిసి స్టాప్ఓవర్ ప్రోగ్రామ్ను లాంఛ్ చేశాయి. ఇది దేశంలో పర్యాటకుల సంఖ్యను పెంచడానికి ఖతార్ టూరిజం అనుసరించిన ఆరు కీలక వ్యూహాలలో ఒకటిగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు ఫలితాన్నిచ్చాయి.
ఖతార్ టూరిజం తాజా డేటా ప్రకారం.. 2022/2023 సీజన్లో (డిసెంబర్ 2022 నుండి మార్చి 2023 వరకు) 253,191 క్రూయిజ్ సందర్శకులు వచ్చారు. ఇది మునుపటి సీజన్తో పోలిస్తే 151% పెరుగుదలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







