గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న88.8 లక్షల మంది ఎన్నారైలు
- July 30, 2023
కువైట్ : మార్చి 2022 నాటికి 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది. 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ఎన్నారైలు నివసిస్తున్నారని ఆర్టీఐకి సమాధానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 88.8 లక్షల మంది విదేశీ భారతీయులు ఆరు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్లో 10.2 లక్షలు, ఖతార్లో 7.4 లక్షలు, ఒమన్లో 7.7, బహ్రెయిన్లో 3.2 లక్షల మంది ఉన్నారు. ఇక అమెరికాలో 12.8 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. యూకేలో 3.5 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.4 లక్షలు, మలేషియాలో 2.2 లక్షలు, కెనడాలో 1.7 లక్షలు మంది ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక పీఐఓలు(31 లక్షల మంది,) ఉన్నారని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27.6 లక్షలు, మయన్మార్లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15.1 లక్షల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









