గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న88.8 లక్షల మంది ఎన్నారైలు

- July 30, 2023 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న88.8 లక్షల మంది ఎన్నారైలు

కువైట్ : మార్చి 2022 నాటికి 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్‌లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది.  210 దేశాల్లో 1.34 కోట్ల మంది ఎన్నారైలు నివసిస్తున్నారని ఆర్టీఐకి సమాధానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 88.8 లక్షల మంది విదేశీ భారతీయులు ఆరు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్‌లో 10.2 లక్షలు, ఖతార్‌లో 7.4 లక్షలు, ఒమన్‌లో 7.7, బహ్రెయిన్‌లో 3.2 లక్షల మంది ఉన్నారు. ఇక అమెరికాలో 12.8 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. యూకేలో 3.5 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.4 లక్షలు, మలేషియాలో 2.2 లక్షలు, కెనడాలో 1.7 లక్షలు మంది ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక పీఐఓలు(31 లక్షల మంది,) ఉన్నారని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27.6 లక్షలు, మయన్మార్‌లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15.1 లక్షల మంది ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com