గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న88.8 లక్షల మంది ఎన్నారైలు
- July 30, 2023
కువైట్ : మార్చి 2022 నాటికి 1.34 కోట్ల మంది ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది. 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ఎన్నారైలు నివసిస్తున్నారని ఆర్టీఐకి సమాధానంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 88.8 లక్షల మంది విదేశీ భారతీయులు ఆరు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్లో 10.2 లక్షలు, ఖతార్లో 7.4 లక్షలు, ఒమన్లో 7.7, బహ్రెయిన్లో 3.2 లక్షల మంది ఉన్నారు. ఇక అమెరికాలో 12.8 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. యూకేలో 3.5 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.4 లక్షలు, మలేషియాలో 2.2 లక్షలు, కెనడాలో 1.7 లక్షలు మంది ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక పీఐఓలు(31 లక్షల మంది,) ఉన్నారని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27.6 లక్షలు, మయన్మార్లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15.1 లక్షల మంది ఉన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







