విమానం ఢీకొని ఇద్దరు దుబాయ్ వాసులు మృతి..!
- July 30, 2023
యూఏఈ: జులై 28న ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లోని కాబూల్చర్ ఎయిర్ఫీల్డ్పై విమానం ఢీకొన్న ప్రమాదంలో ప్రతిష్టాత్మకమైన యోగా శిక్షకురాలు, ప్రఖ్యాత రచయిత్రి జాన్ మాడెర్న్, ఆమె భర్త డేవిడ్ మాడెర్న్ మరణించారు. గతంలో వీరు దుబాయ్ లో నివసించారు. దీంతో దుబాయ్ లోని నివాసితులు వారికి సంతాపం తెలిపారు. ముఖ్యంగా జాన్ యోగా తరగతులు మరియు ఫిట్నెస్ పుస్తకాలు చాలా మంది జీవితాలను మార్చాయని గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు నివాసితులు నివాళులు అర్పిస్తున్నారు. "ఈ విషాద వార్త వినడానికి చాలా బాధగా ఉంది. వారు చాలా ఏళ్లుగా తెలుసు. వారు చాలా సున్నితమైన, మంచి వ్యక్తులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" అని ఒక నివాసి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసారు. ఆస్ట్రేలియా స్థానిక మీడియా సంస్థల ప్రకారం, ఒక విమానం టేకాఫ్ , మరొకటి ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







