విమానం ఢీకొని ఇద్దరు దుబాయ్ వాసులు మృతి..!
- July 30, 2023
యూఏఈ: జులై 28న ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లోని కాబూల్చర్ ఎయిర్ఫీల్డ్పై విమానం ఢీకొన్న ప్రమాదంలో ప్రతిష్టాత్మకమైన యోగా శిక్షకురాలు, ప్రఖ్యాత రచయిత్రి జాన్ మాడెర్న్, ఆమె భర్త డేవిడ్ మాడెర్న్ మరణించారు. గతంలో వీరు దుబాయ్ లో నివసించారు. దీంతో దుబాయ్ లోని నివాసితులు వారికి సంతాపం తెలిపారు. ముఖ్యంగా జాన్ యోగా తరగతులు మరియు ఫిట్నెస్ పుస్తకాలు చాలా మంది జీవితాలను మార్చాయని గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు నివాసితులు నివాళులు అర్పిస్తున్నారు. "ఈ విషాద వార్త వినడానికి చాలా బాధగా ఉంది. వారు చాలా ఏళ్లుగా తెలుసు. వారు చాలా సున్నితమైన, మంచి వ్యక్తులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" అని ఒక నివాసి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసారు. ఆస్ట్రేలియా స్థానిక మీడియా సంస్థల ప్రకారం, ఒక విమానం టేకాఫ్ , మరొకటి ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









