ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోత..
- August 02, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అలవెన్స్ ల్లో కోత విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం 79ని విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ సిబ్బందికి అంతకముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్(ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో పని చేస్తున్న వారి అలవెన్స్ 30 నుండి 25 శాతానికి కుదించింది.
అలాగే ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషినల్ హెచ్ఆర్ఏ సైతం తొలగించింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తివేసింది.
గత నెల(జులై)12వ తేదీన అలవెన్సులలో కోత విధిస్తూ జీవో నెంబర్ 79ని జారీ చేసింది. జీవోకు అనుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం కన్సెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు మొదలయ్యాయి.
తాజా వార్తలు
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!







