ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ ఎయిర్పోర్టు విజ్ఞప్తి
- August 05, 2023
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికుల వెంట వచ్చి, వారికి స్వాగతం, వీడ్కోలు పలికే వారికి హైదరాబాద్ విమానాశ్రయం ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రయాణికుల కోసం వచ్చే వారి స్నేహితులు, బంధువుల వల్ల విమానాశ్రయం ప్రాంతంలో పార్కింగ్ స్థలంతో పాటు ఇతర పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల విమానాశ్రయం ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, వారి బంధుమిత్రులు పరిమితంగా రావాలని విజ్ఞప్తి చేసింది. కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువ కావడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.
Traffic Advisory!#FlyHYD #HYDAirport #Advisory #TrafficAdvisory #Passenger #AirportSecurity pic.twitter.com/hluKwd4F14
— RGIA Hyderabad (@RGIAHyd) August 4, 2023
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









