అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- April 12, 2026
దక్షిణ కశ్మీర్లో ప్రముఖ ఆధ్యాత్మిక అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతీయేటా వైభవంగా నిర్వహించే యాత్రకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. మొత్తం 57రోజులు పాటు సాగనుంది. ఆగస్టు 28వ తేదీన యాత్ర ముగుస్తుంది.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యాత్ర చేపట్టాలనుకునే భక్తులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. జమ్ముకశ్మీర్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదులు చేసుకోవచ్చునని, అదేవిధంగా శ్రీ అమర్నాథ్ జీ పుణ్యే క్షేత్ర బోర్డు మండలి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని మనోజ్ సిన్హా తెలిపారు.
యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 19న జైష్ఠ పౌర్ణమి సందర్భంగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ యాత్ర రెండు ప్రధాన మార్గాల ద్వారా కొనసాగుతుంది. ఒకటి అనంతనాగ్ జిల్లాలోని 48 కిలో మీటర్లు నున్వాన్ – పహల్గాం సంప్రదాయం మార్గం. మరొకటి గందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టాల్ చిన్నదైన కఠినమైన మార్గం.
ఇదిలా ఉంటే..యాత్రలో పాల్గొనే భక్తులకు కనీస వయస్సు 13 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 70 సంవత్సరాలుగా నిర్ణయించారు. 13ఏళ్లకు తక్కువ ఉన్నా.. 70ఏళ్లకు ఎక్కువ వయస్సు ఉన్నా యాత్రకు అనుమతి లేదు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









