2016 తొలి క్వార్టర్లో 8.8 మిలియన్ ప్యాసింజర్లు
- May 16, 2016
హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హెచ్ఐఏ) 2016 తొలి క్వార్టర్లో 8.8 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించి, సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది ఇదే సీజన్లో ప్రయాణించిన ప్రయాణీకులతో పోల్చితే ఈ ఏడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 8,867,971 మంది ప్రయాణీకులు తొలి క్వార్టర్లో ప్రయాణించారు. ఇందులో ఒక్క జనవరిలోనే 3,089,826 ప్రయాణీకులు ప్రయాణం చేయడం గొప్ప విషయం. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ వృద్ధి 8.6 శాతంగా ఉంది. కార్గో విభాగంలో కూడా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఖతార్ డ్యూటీ ఫ్రీ, ప్రీమియర్ షాపింగ్ ఎంపోరియమ్, బోటిక్స్, కేఫ్లు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలతో ప్రయాణీకులకు సరికొత్త ప్రయాణానుభూతిని మిగుల్చుతోంది హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందులోని రెండు రన్వేలు డ్యూయల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!









