2016 తొలి క్వార్టర్లో 8.8 మిలియన్ ప్యాసింజర్లు
- May 16, 2016
హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హెచ్ఐఏ) 2016 తొలి క్వార్టర్లో 8.8 మిలియన్ ప్రయాణీకులకు సేవలందించి, సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది ఇదే సీజన్లో ప్రయాణించిన ప్రయాణీకులతో పోల్చితే ఈ ఏడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 8,867,971 మంది ప్రయాణీకులు తొలి క్వార్టర్లో ప్రయాణించారు. ఇందులో ఒక్క జనవరిలోనే 3,089,826 ప్రయాణీకులు ప్రయాణం చేయడం గొప్ప విషయం. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ వృద్ధి 8.6 శాతంగా ఉంది. కార్గో విభాగంలో కూడా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఖతార్ డ్యూటీ ఫ్రీ, ప్రీమియర్ షాపింగ్ ఎంపోరియమ్, బోటిక్స్, కేఫ్లు, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలతో ప్రయాణీకులకు సరికొత్త ప్రయాణానుభూతిని మిగుల్చుతోంది హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందులోని రెండు రన్వేలు డ్యూయల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







