వరద ప్రభావిత ప్రాంతాలలో సిఎం జగన్‌ పర్యటన

- August 07, 2023 , by Maagulf
వరద ప్రభావిత ప్రాంతాలలో సిఎం జగన్‌ పర్యటన

అమరావతి: సిఎం జగన్‌ ఈరోజు, రేపు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు, మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం జగన్. ఈ మేరకు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు.

మరికాసేపట్లో విఆర్ పురం మండలంలోని వరద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం 12:45 కు బయలుదేరి ఒంటి గంటకి కోతుల గుట్ట హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం 1:05 గంటలకు బయలుదేరి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వెళతారు. అక్కడ వరద బాధిత కుటుంబాలతో సీఎం జగన్ మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com