టూరిజంలో దుబాయ్ రికార్డు..!
- August 07, 2023
యూఏఈ: దుబాయ్కి రికార్డు స్థాయిలో పర్యాటకులు తరలివస్తున్నారు. 2023 మొదటి ఆరు నెలల్లో 8.55 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు సందర్శించారు. ఇది 2019లో 8.36 మిలియన్ల పర్యాటకుల ప్రీ-పాండమిక్ సంఖ్యను అధిగమించింది. దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. నగరం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే గమ్యస్థానంగా మారే లక్ష్యంతో క్రమంగా పురోగమిస్తోంది. 2023లో అన్ని హాస్పిటాలిటీ మెట్రిక్స్లో ఎమిరేట్ హోటల్లు ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించాయి. సగటు హోటల్ ఆక్యుపెన్సీ 78 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ సంవత్సరం అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు 80-95 శాతం మధ్య పాండమిక్ స్థాయికి చేరుకోవచ్చని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చేసిన అంచనాను తాజాగా అధిగమించారు. ఈ సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ "2023 మొదటి అర్ధభాగంలో దుబాయ్ చూసిన అంతర్జాతీయ సందర్శకుల గణనీయమైన పెరుగుదల ప్రపంచవ్యాప్త పర్యాటక రంగంలోనే కాకుండా ప్రకాశవంతమైన ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించింది. దుబాయ్ నాయకత్వం దూరదృష్టితో ఈ సాఫల్యం సాధ్యమైంది. అంతర్జాతీయ సందర్శనల పెరుగుదల ప్రధాన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్ ఎదుగుదలను బలపరుస్తుంది. ఇది వాణిజ్యం, పెట్టుబడి మరియు సంస్థలకు కీలకమైన కేంద్రంగా దాని హోదాను కూడా సూచిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!







