రైస్ బ్యాగులను తెచ్చుకుంటున్న భారతీయ ప్రవాసులు
- August 10, 2023
యూఏఈ: జూలై 20 నుండి బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై భారతదేశం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూఏఈ నివాసితులు వేసవి సెలవుల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఇండియా నుండి బియ్యాన్ని(రైస్) తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇండియా నుంచి బియ్యం తీసుకురావడం అవసరం కంటే ఎక్కువ అలవాటని భారతీయ ప్రవాసురాలు షబ్నాకు తెలిపింది. "ప్రతి సంవత్సరం, మేము మా ఊరిలో లభ్యమయ్యే ఒక నిర్దిష్ట రకం బియ్యాన్ని తీసుకువస్తాము." అని ఆమె చెప్పింది. బియ్యం ప్యాకెట్ ను ఇండియా నుంచి తేవడం ద్వారా కేవలం ఆమె కుటుంబానికి 3 దిర్హామ్ మాత్రమే ఆదా అవుతుంది. "ఇది నిజంగా పెద్ద పొదుపు కాదు. కానీ మేము ఇండియాకు వెళ్ళినప్పుడు, సామానులో స్థలం ఉన్నప్పుడు, మేము బియ్యాన్ని తిరిగి తీసుకువస్తాము." అని ఆమె వివరించింది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో ఇండియా 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధాన్ని యూఏఈలోని చిల్లర వ్యాపారులు క్యాష్ చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్థానిక సూపర్ మార్కెట్ల ప్రకారం.. ఇది తాత్కాలిక సమస్య అని వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ నుండి ఎగుమతులు పెరిగితే యూఏఈలో బాస్మతీయేతర బియ్యం సరఫరా లోటు తగ్గుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







