రైస్ బ్యాగులను తెచ్చుకుంటున్న భారతీయ ప్రవాసులు
- August 10, 2023
యూఏఈ: జూలై 20 నుండి బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై భారతదేశం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూఏఈ నివాసితులు వేసవి సెలవుల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఇండియా నుండి బియ్యాన్ని(రైస్) తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇండియా నుంచి బియ్యం తీసుకురావడం అవసరం కంటే ఎక్కువ అలవాటని భారతీయ ప్రవాసురాలు షబ్నాకు తెలిపింది. "ప్రతి సంవత్సరం, మేము మా ఊరిలో లభ్యమయ్యే ఒక నిర్దిష్ట రకం బియ్యాన్ని తీసుకువస్తాము." అని ఆమె చెప్పింది. బియ్యం ప్యాకెట్ ను ఇండియా నుంచి తేవడం ద్వారా కేవలం ఆమె కుటుంబానికి 3 దిర్హామ్ మాత్రమే ఆదా అవుతుంది. "ఇది నిజంగా పెద్ద పొదుపు కాదు. కానీ మేము ఇండియాకు వెళ్ళినప్పుడు, సామానులో స్థలం ఉన్నప్పుడు, మేము బియ్యాన్ని తిరిగి తీసుకువస్తాము." అని ఆమె వివరించింది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో ఇండియా 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. మరోవైపు బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధాన్ని యూఏఈలోని చిల్లర వ్యాపారులు క్యాష్ చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్థానిక సూపర్ మార్కెట్ల ప్రకారం.. ఇది తాత్కాలిక సమస్య అని వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ నుండి ఎగుమతులు పెరిగితే యూఏఈలో బాస్మతీయేతర బియ్యం సరఫరా లోటు తగ్గుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









