ఫ్లిప్కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్..
- August 10, 2023
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తుంది. ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించనుంది. ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత రుణాలను అందించడానికి యాక్సిస్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను అందిస్తుంది. అలాగే ఆయా రుణాలపై కస్టమర్లుకు 6 నుంచి 36 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. అయితే ఈ లోన్ ఎలా పొందాలో? మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
లోన్ పొందడం ఇలా చెయ్యాలి
ఫ్లిప్కార్ట్ కస్టమర్లు తమ లోనల్ల ఆమోద ప్రక్రియ కేవలం 30 సెకన్లలో పూర్తవుతుంది. రుణ దరఖాస్తును ప్రారంభించడానికి కస్టమర్లు పాన్ నెంబర్, పుట్టిన తేదీ, వర్క్ వివరాల వంటి ప్రాథమిక వివరాలను అందించాలి. ఈ వివరాలను అందించిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వారి రుణ పరిమితిని ఆమోదిస్తుంది. కస్టమర్లు వారి సౌకర్యవంతమైన నెలవారీ రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారి ఇష్టపడే లోన్ మొత్తాన్ని, రీపేమెంట్ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ రుణ దరఖాస్తును ఖరారు చేసే ముందు సమగ్ర లోన్ సారాంశం, రీపేమెంట్ వివరాలు, రివ్యూ కోసం నిబంధనలు, షరత్తులను ఓ సారి తెలుసుకోవడం మంచింది.
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో వ్యూహాత్మక సహకారం ద్వారా కస్టమర్లకు సరసమైన చెల్లింపు ఎంపికల విస్తృత శ్రేణితో విజయవంతంగా సాధికారత కల్పించామని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబతుఉన్నారు. బీఎన్పీఎల్తో పాటు, ఈఎంఐలతో సహా బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లు, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో పర్సనల్ లోన్ సర్వీస్ను పరిచయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. లిక్విడిటీకి ప్రాప్యతను మంజూరు చేయడం ద్వారా క్రెడిట్ని ప్రారంభించడం, కొనుగోలు శక్తిని మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా కస్టమర్లకు కొనుగోలు విషయంలో ఫ్లిప్కార్ట్ చర్యలు ఎక్కువ సౌలభ్యంతో మరింత సౌకర్యాన్ని అందిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







