యూఏఈలో భారీ వర్షాలు. ఆరెంజ్ అలెర్ట్ జారీ
- August 11, 2023
యూఏఈ: అస్థిర వాతావరణం కొనసాగుతున్నందున నివాసితులకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అస్థిర వాతావరణ పరిస్థితుల నివాసితులను ఎన్సిఎం హెచ్చరించింది. నివాసితులు ఆరుబయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో "ప్రమాదకర వాతావరణ సంఘటనలు" జరిగే ప్రమాదం ఉందని సూచిచంచింది. స్థానిక అధికారులు ఇచ్చే సలహాలను ప్రజలు పాటించాలని కోరారు. దేశంలోని తూర్పు ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో కార్లు వరదలతో నిండిన రోడ్ల గుండా వెళుతున్న వీడియోను ఎన్సిఎం షేర్ చేసింది. లోయలు, ఆనకట్టలు మరియు నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని నివాసితులు, సందర్శకులను కోరుతూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో ఇంటి నుండి బయలుదేరే ముందు వాహనదారులు లైట్లు, వైపర్లు, టైర్లు, వాహనం యొక్క చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో దుబాయ్, అల్ ఐన్, షార్జా మరియు ఫుజైరా వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని NCM ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







