డా.మాచర్ల రాధను భర్తే హత్య చేశాడు: ఎస్పీ జాషువా...
- August 11, 2023
మచిలీపట్నం: కట్టుకున్న వాడే కాల యముడయ్యాడు. డాక్టర్ మాచర్ల రాధను ఆమె భర్తే హత్య చేశాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు.
రాధ హత్య కేసులో A-1 ముద్దాయి మృతురాలి భర్త డాక్టర్ మహేశ్వరరావు అని తెలిపారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కారణంగా డ్రైవర్ జనార్ధన్ అలియాస్ మధుతో కలిసి డాక్టర్ మహేశ్వరరావు భార్యను హత్య చేసేందేకు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు.
అనుకున్న ప్రణాళిక ప్రకారం జూలై 25న సాయంత్రం గ్యాస్ సిలిండర్ మూతలు ఓపెన్ చేసే రెంచ్ తో డ్రైవర్ మధు మృతురాలు మాచర్ల రాధ చేతులు వెనక్కి విరచి పట్టుకోగా భర్త డాక్టర్ మహేశ్వరరావు నాలుగు సార్లు బలంగా భార్య తలపై కొట్టగా ఆమె స్పృహతప్పి పడిపోయారని చెప్పారు.
అనుమానం వచ్చి మళ్ళీ చనిపోయే వరకు ఆమెను కొట్టారని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా హత్య స్థలంలో కారం చల్లి అక్కడి నుండి వారు వెళ్లిపోయారని తెలిపారు. కారంను సైతం హత్య స్థలానికి ఒక కిలో మీటరు దూరంలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు విచారణలో బయటపడినట్లు చెప్పారు. హత్యకు గల మిగతా కారణాలను కూలంకశంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









