సెప్టెంబరు 1 నుంచి హోటల్ రూమ్లు, రెస్టారెంట్ల ఫీజులు తగ్గింపు
- August 12, 2023
అబుధాబి: డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం- అబుధాబి (DCT - అబుధాబి) శుక్రవారం ఎమిరేట్లోని హోటళ్లకు వర్తించే ప్రభుత్వ రుసుములను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగం నిరంతర వృద్ధికి మద్దతు ఇస్తుందని, అదే విధంగా పర్యాట రంగంలో అబుధాబిని ప్రపంచ అగ్రగామిగా నిలపుతుందని పేర్కొంది. ఈ మార్పులు సెప్టెంబరు 1, 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. అతిథులకు ఇచ్చే పర్యాటక రుసుమును ఆరు శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించారు. ఒక రాత్రికి ఒక గదికి Dh15 మునిసిపాలిటీ రుసుమును తీసివేశారు. ఆరు శాతం టూరిజం రుసుమును తీసివేయడం మరియు హోటల్ రెస్టారెంట్లకు వర్తించే నాలుగు శాతం మునిసిపాలిటీ రుసుము తగ్గింపు నిర్ణయంలో ఉన్నాయి. అలాగే కస్టమర్కు జారీ చేసిన ఇన్వాయిస్ విలువలో 4 శాతం మున్సిపాలిటీ రుసుము మాత్రం కొనసాగుతుందని తెలిపింది. 2023 చివరి నాటికి 24 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు DCT - అబుదాబిలో టూరిజం డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









