సెప్టెంబరు 1 నుంచి హోటల్ రూమ్లు, రెస్టారెంట్ల ఫీజులు తగ్గింపు
- August 12, 2023
అబుధాబి: డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం- అబుధాబి (DCT - అబుధాబి) శుక్రవారం ఎమిరేట్లోని హోటళ్లకు వర్తించే ప్రభుత్వ రుసుములను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగం నిరంతర వృద్ధికి మద్దతు ఇస్తుందని, అదే విధంగా పర్యాట రంగంలో అబుధాబిని ప్రపంచ అగ్రగామిగా నిలపుతుందని పేర్కొంది. ఈ మార్పులు సెప్టెంబరు 1, 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. అతిథులకు ఇచ్చే పర్యాటక రుసుమును ఆరు శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించారు. ఒక రాత్రికి ఒక గదికి Dh15 మునిసిపాలిటీ రుసుమును తీసివేశారు. ఆరు శాతం టూరిజం రుసుమును తీసివేయడం మరియు హోటల్ రెస్టారెంట్లకు వర్తించే నాలుగు శాతం మునిసిపాలిటీ రుసుము తగ్గింపు నిర్ణయంలో ఉన్నాయి. అలాగే కస్టమర్కు జారీ చేసిన ఇన్వాయిస్ విలువలో 4 శాతం మున్సిపాలిటీ రుసుము మాత్రం కొనసాగుతుందని తెలిపింది. 2023 చివరి నాటికి 24 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు DCT - అబుదాబిలో టూరిజం డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ తెలిపారు.
తాజా వార్తలు
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!









