సెప్టెంబరు 1 నుంచి హోటల్ రూమ్లు, రెస్టారెంట్ల ఫీజులు తగ్గింపు
- August 12, 2023
అబుధాబి: డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం- అబుధాబి (DCT - అబుధాబి) శుక్రవారం ఎమిరేట్లోని హోటళ్లకు వర్తించే ప్రభుత్వ రుసుములను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగం నిరంతర వృద్ధికి మద్దతు ఇస్తుందని, అదే విధంగా పర్యాట రంగంలో అబుధాబిని ప్రపంచ అగ్రగామిగా నిలపుతుందని పేర్కొంది. ఈ మార్పులు సెప్టెంబరు 1, 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. అతిథులకు ఇచ్చే పర్యాటక రుసుమును ఆరు శాతం నుండి నాలుగు శాతానికి తగ్గించారు. ఒక రాత్రికి ఒక గదికి Dh15 మునిసిపాలిటీ రుసుమును తీసివేశారు. ఆరు శాతం టూరిజం రుసుమును తీసివేయడం మరియు హోటల్ రెస్టారెంట్లకు వర్తించే నాలుగు శాతం మునిసిపాలిటీ రుసుము తగ్గింపు నిర్ణయంలో ఉన్నాయి. అలాగే కస్టమర్కు జారీ చేసిన ఇన్వాయిస్ విలువలో 4 శాతం మున్సిపాలిటీ రుసుము మాత్రం కొనసాగుతుందని తెలిపింది. 2023 చివరి నాటికి 24 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు DCT - అబుదాబిలో టూరిజం డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







