మూడు వారాల పాటు చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత: ఎమిరేట్స్
- August 12, 2023
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని చెక్-ఇన్ కౌంటర్లను మూడు వారాల పాటు మూసివేస్తున్నట్లు దుబాయ్కి చెందిన ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్ తెలిపింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 1 వరకు ఎమిరేట్స్ ప్రయాణీకులు, ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ స్కైవార్డ్స్ గోల్డ్ సభ్యులు ఏరియా 6లోని తమ ప్రీమియం చెక్-ఇన్ కౌంటర్లకు వెళ్లాలని ఎయిర్లైన్ సూచించింది. ఎమిరేట్స్ ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు రోజు రాత్రి ఎటువంటి రుసుము లేకుండా తమ లగేజీని విమానాశ్రయంలో వదిలివేయవచ్చని పేర్కొంది. దుబాయ్ నుండి బయలుదేరే ప్రయాణీకులు ముందుగా చెక్ ఇన్ చేసి, బయలుదేరడానికి 24 గంటల ముందు లేదా అమెరికా, టెల్ అవీవ్కు వెళ్లినట్లయితే బయలుదేరే 12 గంటల ముందు బ్యాగ్లను డ్రాప్ చేయవచ్చని తెలిపింది. ప్రయాణీకులు ICD బ్రూక్ఫీల్డ్ ప్లేస్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో కొత్త సిటీ చెక్-ఇన్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







