మూడు వారాల పాటు చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత: ఎమిరేట్స్
- August 12, 2023
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని చెక్-ఇన్ కౌంటర్లను మూడు వారాల పాటు మూసివేస్తున్నట్లు దుబాయ్కి చెందిన ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్ తెలిపింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 1 వరకు ఎమిరేట్స్ ప్రయాణీకులు, ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ స్కైవార్డ్స్ గోల్డ్ సభ్యులు ఏరియా 6లోని తమ ప్రీమియం చెక్-ఇన్ కౌంటర్లకు వెళ్లాలని ఎయిర్లైన్ సూచించింది. ఎమిరేట్స్ ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు రోజు రాత్రి ఎటువంటి రుసుము లేకుండా తమ లగేజీని విమానాశ్రయంలో వదిలివేయవచ్చని పేర్కొంది. దుబాయ్ నుండి బయలుదేరే ప్రయాణీకులు ముందుగా చెక్ ఇన్ చేసి, బయలుదేరడానికి 24 గంటల ముందు లేదా అమెరికా, టెల్ అవీవ్కు వెళ్లినట్లయితే బయలుదేరే 12 గంటల ముందు బ్యాగ్లను డ్రాప్ చేయవచ్చని తెలిపింది. ప్రయాణీకులు ICD బ్రూక్ఫీల్డ్ ప్లేస్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో కొత్త సిటీ చెక్-ఇన్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









