దుబాయ్ లో కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
- August 12, 2023
దుబాయ్: షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ వాహనం డ్రైవర్ ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టాడని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగ్ జుమా సలేం బిన్ సువైదాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిని తక్షణ వైద్య చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు బిన్ సువైదాన్ వివరించారు. వేగ పరిమితులను పాటించాలని, వాహనాల మధ్య సురక్షితమైన దూరం పాటించాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు స్థిరంగా కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







