దుబాయ్ లో కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
- August 12, 2023
దుబాయ్: షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ వాహనం డ్రైవర్ ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టాడని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగ్ జుమా సలేం బిన్ సువైదాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిని తక్షణ వైద్య చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు బిన్ సువైదాన్ వివరించారు. వేగ పరిమితులను పాటించాలని, వాహనాల మధ్య సురక్షితమైన దూరం పాటించాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు స్థిరంగా కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









