దుబాయ్ లో కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
- August 12, 2023
దుబాయ్: షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ వాహనం డ్రైవర్ ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టాడని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగ్ జుమా సలేం బిన్ సువైదాన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిని తక్షణ వైద్య చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు బిన్ సువైదాన్ వివరించారు. వేగ పరిమితులను పాటించాలని, వాహనాల మధ్య సురక్షితమైన దూరం పాటించాలని దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు స్థిరంగా కట్టుబడి ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







