కువైట్లో ICC ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ
- August 12, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, కువైట్ క్రికెట్ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ అబ్బాస్ ఫర్మాన్ ICC ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందులో ICC డిప్యూటీ ఛైర్మన్, ఇమ్రాన్ ఖవాజా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను ఇండియాలో జరుగనుంది. ఈ ట్రోఫీ ఆవిష్కరణ వేడుకలో కువైట్ క్రికెట్ అధికారులు, ICC, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ అధికారులు, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ రాయబారులు, మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలలో ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









