కువైట్లో ICC ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ
- August 12, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, కువైట్ క్రికెట్ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ అబ్బాస్ ఫర్మాన్ ICC ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందులో ICC డిప్యూటీ ఛైర్మన్, ఇమ్రాన్ ఖవాజా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను ఇండియాలో జరుగనుంది. ఈ ట్రోఫీ ఆవిష్కరణ వేడుకలో కువైట్ క్రికెట్ అధికారులు, ICC, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ అధికారులు, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ రాయబారులు, మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలలో ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









