కువైట్లో ICC ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ
- August 12, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, కువైట్ క్రికెట్ ప్రెసిడెంట్ మిస్టర్ హైదర్ అబ్బాస్ ఫర్మాన్ ICC ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందులో ICC డిప్యూటీ ఛైర్మన్, ఇమ్రాన్ ఖవాజా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను ఇండియాలో జరుగనుంది. ఈ ట్రోఫీ ఆవిష్కరణ వేడుకలో కువైట్ క్రికెట్ అధికారులు, ICC, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ అధికారులు, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ రాయబారులు, మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రపంచ వ్యాప్తంగా కువైట్, బహ్రెయిన్, మలేషియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా 18 దేశాలలో ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







