పాలస్తీనాలో సౌదీ మొదటి రాయబారిగా అల్-సుదైరి
- August 14, 2023
అమ్మాన్: పాలస్తీనాలో మొదటి రాయబారిని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ క్రమంలో పాలస్తీనాకు సౌదీ అరేబియా నియమించిన మొదటి రాయబారి నైఫ్ బిన్ బందర్ అల్-సుదైరి శనివారం పాలస్తీనా అధికారులకు తన ధ్రువపత్రాల లేఖను సమర్పించారు. జోర్డాన్లోని పాలస్తీనా రాయబార కార్యాలయంలో దౌత్య వ్యవహారాల కోసం అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సలహాదారు మజ్దీ అల్-ఖలిదీకి రాయబారి అల్-సుదైరీ ఆధారాల లేఖను అందజేశారు. త్వరలోనే పాలస్తీనా అధ్యక్షుడికి అసలు ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అల్-సుదైరి పాలస్తీనాలో సౌదీ అరేబియా నాన్-రెసిడెంట్ రాయబారిగా, జెరూసలేంలో కాన్సుల్ జనరల్గా వ్యవహరిస్తారు. అల్-సుదైరి అమ్మాన్కు సౌదీ రాయబారిగా కూడా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







