పాలస్తీనాలో సౌదీ మొదటి రాయబారిగా అల్-సుదైరి
- August 14, 2023
అమ్మాన్: పాలస్తీనాలో మొదటి రాయబారిని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ క్రమంలో పాలస్తీనాకు సౌదీ అరేబియా నియమించిన మొదటి రాయబారి నైఫ్ బిన్ బందర్ అల్-సుదైరి శనివారం పాలస్తీనా అధికారులకు తన ధ్రువపత్రాల లేఖను సమర్పించారు. జోర్డాన్లోని పాలస్తీనా రాయబార కార్యాలయంలో దౌత్య వ్యవహారాల కోసం అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సలహాదారు మజ్దీ అల్-ఖలిదీకి రాయబారి అల్-సుదైరీ ఆధారాల లేఖను అందజేశారు. త్వరలోనే పాలస్తీనా అధ్యక్షుడికి అసలు ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అల్-సుదైరి పాలస్తీనాలో సౌదీ అరేబియా నాన్-రెసిడెంట్ రాయబారిగా, జెరూసలేంలో కాన్సుల్ జనరల్గా వ్యవహరిస్తారు. అల్-సుదైరి అమ్మాన్కు సౌదీ రాయబారిగా కూడా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









