కిడ్నీలో రాళ్లు.! ఈ జాగ్రత్తలు మీకు తెలుసా.?
- August 14, 2023
నడుము కింది భాగంలో విపరీతమైన నొప్పి, పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో అస్సలు కూర్చోవడానికే చాలా ఇబ్బంది పడిపోవడం.. ఈ లక్షణాలుంటే కిడ్నీలో రాళ్లున్నట్లుగా అనుమానించొచ్చు.
కిడ్నీలో రాళ్లకు ఒకింత జీవన శైలి కారణం కాగా, మరికొంత వారసత్వం కూడా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, కిడ్నీలో రాళ్లు మందులతో కరిగించొచ్చా.? ఎంత సైజులో వుంటే అది సాధ్యపడుతుంది.? ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ వరకూ వెళ్లాలి.? అనే అంశాలపై అవగాహన కోసం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మీకోసం.
కిడ్నీల్లో రాళ్లు రాకుండా వుండాలంటే, తగినంత నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకింత ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గముంటుంది. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుంటే, కొన్ని జాగ్రత్తల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. అయితే, ఆరంభ సమయంలో మాత్రమే.
రాళ్లు 6 mm కన్నా తక్కువ సైజ్లో వుంటే, వాటిని ఆహారంలో మార్పులతో పాటూ, వైద్యులు సూచించిన మందులతో కరిగించొచ్చు. అంతకన్నా ఎక్కువ సైజులో వుంటే, మూత్రాశయ నాళాల్లో అడ్డు తగిలి, మూత్ర విసర్ఝనలో భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆపరేషన్ (ఎండోస్కోపీ) ద్వారా వాటిని తొలిగించాలి.
ఇక, ఆహారం విషయానికి వస్తే, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలను తగ్గించాలి. పాలకూర, టమోటా తక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







