కిడ్నీలో రాళ్లు.! ఈ జాగ్రత్తలు మీకు తెలుసా.?
- August 14, 2023
నడుము కింది భాగంలో విపరీతమైన నొప్పి, పొత్తి కడుపులో భరించలేనంత నొప్పితో అస్సలు కూర్చోవడానికే చాలా ఇబ్బంది పడిపోవడం.. ఈ లక్షణాలుంటే కిడ్నీలో రాళ్లున్నట్లుగా అనుమానించొచ్చు.
కిడ్నీలో రాళ్లకు ఒకింత జీవన శైలి కారణం కాగా, మరికొంత వారసత్వం కూడా వుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, కిడ్నీలో రాళ్లు మందులతో కరిగించొచ్చా.? ఎంత సైజులో వుంటే అది సాధ్యపడుతుంది.? ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ వరకూ వెళ్లాలి.? అనే అంశాలపై అవగాహన కోసం నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మీకోసం.
కిడ్నీల్లో రాళ్లు రాకుండా వుండాలంటే, తగినంత నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకింత ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గముంటుంది. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుంటే, కొన్ని జాగ్రత్తల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. అయితే, ఆరంభ సమయంలో మాత్రమే.
రాళ్లు 6 mm కన్నా తక్కువ సైజ్లో వుంటే, వాటిని ఆహారంలో మార్పులతో పాటూ, వైద్యులు సూచించిన మందులతో కరిగించొచ్చు. అంతకన్నా ఎక్కువ సైజులో వుంటే, మూత్రాశయ నాళాల్లో అడ్డు తగిలి, మూత్ర విసర్ఝనలో భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆపరేషన్ (ఎండోస్కోపీ) ద్వారా వాటిని తొలిగించాలి.
ఇక, ఆహారం విషయానికి వస్తే, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలను తగ్గించాలి. పాలకూర, టమోటా తక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ