వచ్చే వారం గ్రేటర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ : మంత్రి కెటిఆర్
- August 16, 2023
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. తొలివిడతలో దాదాపు 75 వేలకు పైగా డబుల్ బెడ్రూంలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈమేరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లతో ఆయన సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా హాజరైన ఈ భేటీలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తికావచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, పేదలకు పంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 70 వేల ఇళ్లతో పాటు చివరి దశలో ఉన్న మరో ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి వచ్చే వారం నుంచి లబ్దిదారులకు అందజేస్తామని వివరించారు. గ్రేటర్ లో ఇప్పటికే 4,500 లకు పైగా ఇళ్లను లబ్దిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికలో రాజకీయ నేతల జోక్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కెటిఆర్ వివరించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పరిశీలించి, అర్హులను గుర్తించిందని చెప్పారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







