భారత్ లో భారీ వరదలు. సంతాపం తెలిపిన కువైట్
- August 17, 2023
కువైట్: భారత్ లో ఇటీవల తలెత్తిన వరదలకు ప్రాణనష్టం జరగడంపై హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంతాపాన్ని తెలియజేశారు. వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత రాష్ట్రపతికి సంతాపాన్ని తెలుపులూ లేఖలు పంపారు. దేశంలోని ఉత్తరాన ఆకస్మిక వరదలు సంభవించి డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సానుభూతి, సంఘీభావం తెలిపింది. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో సంతాపాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







