భారత్ లో భారీ వరదలు. సంతాపం తెలిపిన కువైట్

- August 17, 2023 , by Maagulf
భారత్ లో భారీ వరదలు. సంతాపం తెలిపిన కువైట్

కువైట్: భారత్ లో ఇటీవల తలెత్తిన వరదలకు ప్రాణనష్టం జరగడంపై హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంతాపాన్ని తెలియజేశారు. వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత రాష్ట్రపతికి సంతాపాన్ని తెలుపులూ లేఖలు పంపారు. దేశంలోని ఉత్తరాన ఆకస్మిక వరదలు సంభవించి డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సానుభూతి, సంఘీభావం తెలిపింది. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో సంతాపాన్ని తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com