52 ఏళ్ల తర్వాత క్లాస్మేట్స్తో లులూ డైరెక్టర్ రీయూనియన్. Dh220,000 విరాళం
- August 17, 2023
యూఏఈ: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కరాంచీరాలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో 52 ఏళ్ల తర్వాత యూఏఈ వ్యాపారవేత్త M. A. యూసఫ్ అలీ(లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్) తన క్లాస్ మేట్స్, మాజీ ఉపాధ్యాయులతో రీయూనియన్ అయ్యారు. అంతకుముందు ఆయనకు స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం తరగతి గదిలో తన బ్యాచ్మేట్స్తో మాట్లాడారు. యూసఫ్ అలీ తన గురువుకు నమస్కరించి సత్కరించారు. సహవిద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేశారు. అతను బయలుదేరే ముందు తన పాఠశాల నిధికి సుమారు Dh220,000 విరాళం అందజేశాడు.
1973లో మొదటిసారిగా యూఏఈకి చేరుకున్న యూసఫ్ అలీ తన మామకు కిరాణా దుకాణంలో సహాయం చేస్తూ నగరంలో తన పనిని ప్రారంభించాడు. తన చురుకైన వ్యాపార చతురతతో అతను 1990లలో లులు గ్రూప్ ఆఫ్ హైపర్ మార్కెట్ను స్థాపించాడు. యూఏఈలోని రిటైల్ ల్యాండ్స్కేప్ను క్రమంగా విస్తరించాడు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ 2015లో గ్రేట్ స్కాట్లాండ్ యార్డ్ను 550 మిలియన్ దిర్హామ్లకు కొనుగోలు చేసింది. తరువాత Dh250 మిలియన్ విలువైన హోటల్ మేక్ఓవర్ను పూర్తి చేసింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









