52 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్‌తో లులూ డైరెక్టర్ రీయూనియన్. Dh220,000 విరాళం

- August 17, 2023 , by Maagulf
52 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్‌తో లులూ డైరెక్టర్ రీయూనియన్. Dh220,000 విరాళం

యూఏఈ: భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కరాంచీరాలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌లో 52 ఏళ్ల తర్వాత యూఏఈ వ్యాపారవేత్త M. A. యూసఫ్ అలీ(లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్) తన క్లాస్ మేట్స్, మాజీ ఉపాధ్యాయులతో రీయూనియన్ అయ్యారు. అంతకుముందు ఆయనకు స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.  అనంతరం తరగతి గదిలో తన బ్యాచ్‌మేట్స్‌తో మాట్లాడారు. యూసఫ్ అలీ తన గురువుకు నమస్కరించి సత్కరించారు. సహవిద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేశారు.  అతను బయలుదేరే ముందు తన పాఠశాల నిధికి సుమారు Dh220,000 విరాళం అందజేశాడు.

1973లో మొదటిసారిగా యూఏఈకి చేరుకున్న యూసఫ్ అలీ తన మామకు కిరాణా దుకాణంలో సహాయం చేస్తూ నగరంలో తన పనిని ప్రారంభించాడు. తన చురుకైన వ్యాపార చతురతతో అతను 1990లలో లులు గ్రూప్ ఆఫ్ హైపర్ మార్కెట్‌ను స్థాపించాడు. యూఏఈలోని రిటైల్ ల్యాండ్‌స్కేప్‌ను క్రమంగా విస్తరించాడు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ 2015లో గ్రేట్ స్కాట్లాండ్ యార్డ్‌ను 550 మిలియన్ దిర్హామ్‌లకు కొనుగోలు చేసింది. తరువాత Dh250 మిలియన్ విలువైన హోటల్ మేక్ఓవర్‌ను పూర్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com