ఎడారిలో వికసించిన కమలం...అబుధాబి BAPS హిందూ మందిర్
- August 18, 2023
అబుధాబి: అబుధాబిలో చారిత్రాత్మక మరియు ఐకానిక్ BAPS హిందూ మందిర్ ప్రారంభోత్సవం 2024 ఫిబ్రవరి 14న జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ని బ్రహ్మవిహారి స్వామి కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్కి ఓ ప్రత్యేకమైన దండను అందించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన మహిళా వాలంటీర్లు అత్యంత శ్రద్ధతో ఈ దండను రూపొందించారు. దానిలోని ప్రతి భాగం సింబాలిక్ అర్థాన్ని కలిగి ఉంది. గులాబీ బంగారు తాటి ఆకులపై భగవాన్ స్వామినారాయణ్ యొక్క 108 పేర్లను చేతితో వ్రాసి ఉంటుంది. ప్రతి ఆకులో ఖర్జూరం ఆకారంలో ఉండే కుంకుమపువ్వు ఒక సువాసనను వెదజల్లుతుంది. మధ్యలో ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ చిహ్నం ఏర్పాటు చేశారు. ఆనంతరం పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ తన ఉపన్యాసంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. దేవుడి దివ్య సంకల్పం వల్లే మందిర నిర్మాణం జరుగుతోందని.. మందిరంలో ఉన్న విలువలు మనుషులతో, ప్రపంచంతో మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను చెబుతూ "మందిరం ఎడారిలో వికసించిన కమలం లాంటిది" అని ఆయన అభివర్ణించారు. ఈ మందిరం ప్రపంచం, మానవత్వం మరియు భవిష్యత్తుపై తనదైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







